News March 11, 2025
మందమర్రి: మహిళపై గొడ్డలితో దాడి

మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అంగడిబజార్ ప్రాంతంలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కందుల కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంచినీళ్ల విషయంలో పగిడి రాంబాయి అనే మహిళతో గొడవపడ్డాడు. అనంతరం ఆగ్రహంతో ఆమెపై గొడ్డలితో దాడి చేయగా రాంబాయి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 29, 2025
సంగారెడ్డి: నవంబర్ 5న నదర్ సమ్మేళనం: జగ్గారెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద సదర్ సమ్మేళనం నవంబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సదర్ సమ్మేళనం పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రదీప్ కుమార్, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.
News October 29, 2025
జూబ్లీహిల్స్ బై పోల్లో కాస్ట్ పాలి‘ట్రిక్స్’..!

జూబ్లీహిల్స్ గెలుపుకోసం కాస్ట్ ఓటింగ్పై నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కులాల వారీగా బీసీల ఓట్లు 1.34 లక్షలు, ముస్లిం మైనారిటీలు 1.20 లక్షలు, కమ్మవారి ఓట్లు 22,746, రెడ్డిలు 17,641, లంబాడీలు 11,364, క్రిస్టియన్లు 19,396 మంది, ఎస్సీలు 28,350 మంది ఉన్నట్లు సమాచారం. ఏపీలో వర్కౌట్ అయ్యే కాస్ట్ పాలి‘ట్రిక్స్’ మన దగ్గర అమలవుతుందో చూడాలి.
News October 29, 2025
జూబ్లీహిల్స్: KTR రోడ్ షో తేదీలు ఖరారు

జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. OCT 31న షేక్పేట్, NOV 1న రహమత్నగర్, 2న యూసుఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంకట్రావునగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో వరుసగా రోడ్షోలు నిర్వహించనున్నారు. 30వ తేదీని నుంచి సీఎం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. KCR పర్యటనపై ఇంకా స్పష్టతలేదు.


