News March 15, 2025

మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

image

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.

Similar News

News November 14, 2025

కొత్తగూడెం: జాతీయ స్థాయిలో సింగరేణికి అవార్డు

image

కేంద్ర బొగ్గు, గనుల శాఖ నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. గురువారం ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనకు అందజేశారు. కోల్ ఇండియాతో పాటు ఇతర గనుల సంస్థల నుంచి సింగరేణి ఈ గుర్తింపు సాధించింది.

News November 14, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ జిల్లాలో 83,850 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: కలెక్టర్
✓ గ్రంథాలయ పన్నులు సకాలంలో చెల్లించాలి: అ.కలెక్టర్
✓ మణుగూరు: ట్రాఫిక్ జాం.. 4KM నడిచిన విద్యార్థులు
✓ పాల్వంచ: హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసిన DMHO
✓ విద్యార్థులు ట్రైబల్ మ్యూజియం సందర్శించాలి: ఐటీడీఏ పీఓ
✓ ఉపకార వేతనాల కోసం బీసీ విద్యార్థులు అప్లై చేసుకోండి
✓ దుమ్ముగూడెం: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు

News November 14, 2025

గొంతులో మటన్ ముక్క.. ఊపిరాడక వ్యక్తి మృతి

image

TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి తాపీ మేస్త్రీలకు ఓ ఇంటి యజమాని దావత్ (విందు) ఏర్పాటు చేశారు. అక్కడ మటన్ తింటుండగా లక్ష్మయ్య (65) గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.