News March 12, 2025

మందస: భార్య, కూతురు అదృశ్యం..కేసు నమోదు

image

మందస మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన పానిల సింహాచలం (27) తన భార్య జ్యోతి (22), కుమార్తె హన్విక (11నెలలు) కనిపించడం లేదంటూ..మంగళవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన నా భార్య, కూతురు మందస మండలం కొర్రాయి గేటు వద్ద బస్సు ఎక్కి కాశీబుగ్గ వచ్చారని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News April 19, 2026

శ్రీకాకుళం: అసలు సూత్రధారులెవరో..?

image

ఈ ఏడాది రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. వీటి ముద్రణలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి<<19679785>> ఆరుగురిపై<<>> కేసు నమోదు చేశారు. అసలు ఈ పాసులను ముద్రించమన్నదెవరూ? ఇవి బయటికెలా వచ్చాయనే విషయాలను వెల్లడించకపోవడంతో అసలు నిందితులను రాజకీయ ఒత్తిడితో దాచిపెట్టారనే ఆరోపణలోస్తున్నాయి. తెర వెనక పాత్రదారులను పట్టుకోవాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

News April 19, 2026

శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ప్రభుత్వం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మార్కులు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇంప్రూవ్మెంట్ కట్టుకునే వెసులు బాటును ఈ ఏడాది నుంచి ప్రారంభించింది. శ్రీకాకుళం జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 73 శాతం ఫలితాలు వచ్చాయి. 17,355 మంది పరీక్ష రాయిగా 12,684 ఉత్తీర్ణత సాధించారు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

News April 19, 2026

మెళియాపుట్టి: భర్త చితికి నిప్పుపెట్టిన భార్య

image

ఇంటి యజమాని మృతి చెందిన బాధను దిగమింగుతూ భార్య, భర్తకు తలకొరివి పెట్టిన ఘటన మెళియాపుట్టి(మ) చాపరలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు..చాపరలో నివసిస్తున్న కృష్ణ(52) పెట్రోల్ బంక్‌లో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడగా..శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. పిల్లలు చిన్నవారు కాగా..భర్త మరణంతో కన్నీరుమున్నీరువుతూ ఆయన చితికి భార్య నిప్పుపెట్టింది.