News July 21, 2024

మందస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా మందస-బారువ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎస్.కె షరీఫ్ ఆదివారం తెలిపారు. అతని వయసు సుమారుగా 20-25 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 16, 2025

శ్రీకాకుళం: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

image

శ్రీకాకుళం నగరంలోని ఏపీ.ఎస్.ఆర్టీసీ డిపో 1 లో శనివారం రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్, డీఎస్పీ వివేకానంద పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రతా ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం శ్రీకాకుళం,టెక్కలి, పలాస డిపోలో ఎక్కువ కాలం ప్రమాద రహిత డ్రైవర్స్‌గా ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. 

News February 15, 2025

పలాస : రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

తిరుపతి – పూరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే 9440627567 నంబరుకు సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామన్నారు.

News February 15, 2025

రణస్థలం : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జేసీ

image

రణస్థలం మండలం పైడి భీమవరం ఇసుక తనిఖీ కేంద్రం వద్ద 28 లారీలను జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. అందులో 12 లారీలు నకిలీ బిల్లులతో రవాణా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయా లారీలను సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు. అనంతరం వాటిని మైన్స్ అండ్ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఎన్ ప్రసాద్, ఎస్సై చిరంజీవి, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!