News January 13, 2025

మంద జగన్నాథం మృతి పట్ల సీఎం సంతాపం

image

నాగర్‌కర్నూల్ మాజీ MP మంద జగన్నాథం మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Similar News

News December 4, 2025

MBNR: ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. వేటు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. 3 విడుదల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కఠిన నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు సర్పంచ్, వార్డు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గోపాలమిత్రాలు, సీసీలు వంటి వర్గాలు ఏ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగం పోతుంది. జాగ్రత్త సుమా..!

News December 4, 2025

MBNR: స్థానిక సంస్థలు ఫేజ్-3 మొదటి రోజు 81 నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా పేజ్ 3 మొదటి రోజున 81 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మూడో విడుదల భాగంగా అడ్డాకుల మండలంలోని 17 గ్రామాల నుంచి ఆరు నామినేషన్లు, బాలానగర్ మండలంలోని 37 గ్రామాల నుంచి 22 నామినేషన్లు, భూత్పూర్ మండలంలోని 19 గ్రామాల నుంచి 17 నామినేషన్లు, జడ్చర్లలోని 45 గ్రామాల నుంచి 25 నామినేషన్లు, మూసాపేటలోని 15 గ్రామాల నుంచి 11 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News December 4, 2025

నవాబుపేట మండలంలోని అత్యధిక ఏకగ్రీవాలు

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి విడతలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేట మండలంలో అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయి. మండలంలోని కాకర్జాల పల్లె గడ్డ, పుట్టోని పల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైన అధికారులు వెల్లడించారు. గండీడ్ మండలంలో అంచనపల్లి, మన్సూర్ పల్లి, మహమ్మదాబాద్ మండలంలోని ఆముదాల గడ్డ, రాజాపూర్ మండలంలోని మోత్కులకుంట తండా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.