News January 23, 2025

మక్తల్: అనుమానాలొద్దు.. అందరికీ పథకాలు: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వార్డు కమిటీ హాల్ లో 3, 7, 11, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా అమలయ్యే నాలుగు పథకాలపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని, అర్హులైన వారికి పథకాలు అందుతాయన్నారు.

Similar News

News November 13, 2025

ఈ నెల 14న 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు

image

వనపర్తిలోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ జి గోవర్ధన్, కార్యదర్శి బి.వెంకటయ్య తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు సాగే వారోత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభిస్తారన్నారు. విద్యార్థిని, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

News November 13, 2025

MHBD: బీసీ విద్యార్థులకు ఉపకార వేతన దరఖాస్తులు ఆహ్వానం

image

2025-26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ-పాస్ వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 13, 2025

విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

image

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.