News April 12, 2025
మక్తల్: ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేసిన ఎమ్మెల్యే

మక్తల్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రిజర్వాయర్ గేట్ల నుంచి నీరు వృథా కాకుండా మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. లక్ష్యం మేరకు వ్యవసాయ పొలాలకు సాగు నీటిని అందించాలని చెప్పారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
News September 15, 2025
‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.
News September 15, 2025
DSC రిజల్ట్స్: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ది మన విజయనగరమే

ఈరోజు విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన కడగల భవాని టి.జి.టి ప్రత్యేక భౌతిక శాస్త్రం విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమె మరడాం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త, తల్లిదండ్రులు, అత్త మామల సహకారం తనను ఈ స్థాయిలో నిలిపిందని ఆమె తెలిపారు. ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.