News April 12, 2025

మక్తల్: ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేసిన ఎమ్మెల్యే

image

మక్తల్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రిజర్వాయర్ గేట్ల నుంచి నీరు వృథా కాకుండా మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. లక్ష్యం మేరకు వ్యవసాయ పొలాలకు సాగు నీటిని అందించాలని చెప్పారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 15, 2025

రూ.1కే రీఛార్జ్.. 30 రోజుల పాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్

image

దీపావళి సందర్భంగా కొత్త యూజర్లకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL బంపరాఫర్ ప్రకటించింది. రూ.1కే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2 జీబీ డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘BSNL దీపావళి బొనాంజా’ ఆఫర్ నేటి నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని Xలో వెల్లడించింది.

News October 15, 2025

కామారెడ్డి: DCC అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నారెడ్డి మోహన్ రెడ్డి

image

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రామారెడ్డి జడ్పీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నారెడ్డి మోహన్ రెడ్డి బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా అబ్జర్వర్ రాజ్ పాల్‌కు దరఖాస్తును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆపత్కాలంలో పార్టీకి ఎనలేని సేవలు చేశానని, తన సేవలను గుర్తించి డీసీసీ పదవి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 15, 2025

మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్

image

TG: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ప్ లైన్ నంబర్‌కి ఫోన్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల్లో నగదు చెల్లింపు చేయాలని అధికారులతో సమీక్షలో ఆదేశించారు. ఈ సీజన్‌లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.