News February 18, 2025

మక్తల్: భూ సర్వే చేపట్టడంపై రైతుల ఆందోళన

image

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మక్తల్ మండల పరిధిలోని కాట్రేవ్ పల్లి, ఎర్నగన్ పల్లి గ్రామాల శివారులో సోమవారం అధికారులు భూ సర్వే చేపట్టారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు అక్కడికి చేరుకుని భూ సర్వే ను అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా భూ సర్వే ఎలా చేస్తారని ఆందోళనకు దిగారు. ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించాడు. రైతులతో సమావేశం నిర్వహించి భూ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 3, 2025

HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

image

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.

News December 3, 2025

అల్లూరి: పేరెంట్స్ మీట్‌కు రూ.54.92లక్షల విడుదల

image

అల్లూరి జిల్లాలో ఈనెల 5న జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌కు ప్రభుత్వం రూ.54.92 లక్షలు విడుదల చేసిందని DEO బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని టీచర్స్&పేరెంట్స్ సహకారంతో నిర్వహించాలన్నారు. ప్రతీ పేరెంట్‌కు ఆహ్వానం అందించాలన్నారు. 2,913 ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

News December 3, 2025

HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

image

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.