News August 17, 2024
మచిలీపట్నంలో హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎస్పీ

పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించగలమని ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని పోలీస్ కల్యాణ మండపంలో సిబ్బంది & వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News November 17, 2025
మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడకుండా సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. పథకం అమలులో లోటుపాట్లపై ఆరా తీశారు.
News November 17, 2025
మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడకుండా సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. పథకం అమలులో లోటుపాట్లపై ఆరా తీశారు.
News November 17, 2025
EVM గోడౌన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

EVM గోడౌన్ వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.


