News March 30, 2024
మచిలీపట్నం: అరుదైన రికార్డు ముంగిట బాలశౌరి
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒకే నాయకుడు రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందలేదు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన బాలశౌరి ఈసారి జనసేనలో చేరి NDA కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి గెలిస్తే 2 వేర్వేరు పార్టీల నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. మరి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News January 13, 2025
అధిష్ఠానం వద్దకు నూజివీడు తెలుగు తమ్ముళ్ల రగడ
నూజివీడులో తెలుగు తమ్ముళ్ల రగడ అధిష్ఠానం వద్దకు చేరింది. మంత్రి పార్థసారథి వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినాటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని జెండా పట్టిన వారికి కాకుండా, అధికారంలోకి రాగానే టీడీపీ తీర్థం తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కాగా చాట్రాయి మండలంలో టీడీపీకి కార్యకర్తలు రాజీనామా చేశారు.
News January 13, 2025
కృష్ణా: భోగి మంట వేస్తున్నారా..?
సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
కృష్ణా: భోగి మంట వేస్తున్నారా..?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.