News November 11, 2024
మచిలీపట్నం: ఈ ఆలయంలో అన్ని మతాల దేవుళ్ల దర్శనం

మచిలీపట్నంలోని సాయిబాబా ఆలయంలో ఒకేసారి అందరి దేవుళ్లను దర్శించుకోవచ్చు. ఈ బాబా విగ్రహం ఎత్తు 44, వెడల్పు 45 అడుగులు ఉంటుంది. 2011 ఆగస్టులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే ఎత్తైన సాయిబాబా విగ్రహంగా ప్రకటించారు. ఈ ఆలయంలో పలు రూపాలలో బాబా దర్శనం ఇస్తాడు. ఇక్కడ హిందూ, ముస్లీం, క్రైస్తవ మతాలకు చెందిన దేవుళ్లు ఉండటం విశేషం. ఈ బాబా కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు.
Similar News
News November 17, 2025
కృష్ణా: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. జిల్లాలో వరి కోతలను రైతులు ముమ్మరం చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది వరి కోత మిషన్ల ధరలను విపరీతంగా పెంచేశారు. గంటకు రూ.3 వేలుకు గాను రూ. 4వేలు వరకు డిమాండ్ చేస్తుండటం రైతులకు భారంగా మారింది.
News November 17, 2025
కృష్ణా: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. జిల్లాలో వరి కోతలను రైతులు ముమ్మరం చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది వరి కోత మిషన్ల ధరలను విపరీతంగా పెంచేశారు. గంటకు రూ.3 వేలుకు గాను రూ. 4వేలు వరకు డిమాండ్ చేస్తుండటం రైతులకు భారంగా మారింది.
News November 17, 2025
కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.


