News March 21, 2025
మచిలీపట్నం: చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య

మచిలీపట్నం చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన విర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను నివాసంలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందారు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకొని మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 25, 2025
MTM: ఎస్సీల సంక్షేమానికి రూ.341 కోట్ల బడ్జెట్ : శ్రీదేవి

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.341 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మంగళవారం మచిలీపట్నం వచ్చిన ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు.
News March 25, 2025
ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు: ఎమ్మెల్యే

గుడివాడ – పామర్రు ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని రైల్వే గేట్లపై నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. మంగళవారం జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో ఎమ్మెల్యే తన స్వగృహంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించారు. రైల్వే గేట్లపై ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరగలేదన్నారు.
News March 25, 2025
తాడేపల్లిలో వివాహిత దారుణ హత్య (అప్డేట్)

తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి లక్ష్మీ తిరుపతమ్మ (పామర్రుకు చెందిన వివాహిత) హత్యకు గురైన విషయం తెలిసిందే. లక్ష్మీ తిరుపతమ్మతో సన్నిహితంగా ఉండే బిహార్కు చెందిన కార్మికులు హత్య చేసినట్లు ఆమె సోదరుడు ఆరోపించాడు. పోలీసులు లక్ష్మీ తిరుపతమ్మ స్నేహితురాలిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోమవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేశారు.