News December 9, 2024
మచిలీపట్నం: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

కృష్ణాజిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కార చర్యల నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ బదిలీ చేశారు.
Similar News
News October 20, 2025
కృష్ణా: ఈ ఆలయం నరకాసురుడి సంహారానికి ప్రతీక..!

చల్లపల్లి మండలం నడకుదురులోని కృష్ణానది తీరాన ఉన్న పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఇక్కడే నరకాసురుడిని సంహరించారని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం ‘నరకొత్తూరు’ నుంచి ‘నడకుదురు’గా మారింది. ఇక్కడి పాటలీ వృక్షం అరుదైనది. దీపావళికి నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. కార్తికంలో భక్తులు నది స్నానమాచరించి మొక్కులు తీర్చుకుంటారు.
News October 19, 2025
కృష్ణా: దీపావళి వ్యాపారాలపై వరుణుడి ప్రభావం

ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జిల్లాలో దీపావళి వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. పండుగ ముందు రోజే పూజా సామాగ్రి కొనుగోలు కోసం మార్కెట్కు రావాల్సిన ప్రజలు వర్షం కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. పూలు, పండ్లు, ప్రమిదలు, ఇతర పూజా సామాగ్రి కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. వర్షం ఆగకపోతే పండుగ రోజు కూడా వ్యాపార నష్టం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News October 19, 2025
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అధిక శబ్దం కలిగిన బాణాసంచాను కాల్చే సమయంలో తోటి వారికి ఇబ్బంది కలగకుండా కుటుంబ సభ్యులు ముందుగా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. బాణాసంచా నిల్వలు కలిగి ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.