News December 9, 2024
మచిలీపట్నం: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

కృష్ణాజిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కార చర్యల నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ బదిలీ చేశారు.
Similar News
News November 17, 2025
EVM గోడౌన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

EVM గోడౌన్ వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
News November 17, 2025
కృష్ణా: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. జిల్లాలో వరి కోతలను రైతులు ముమ్మరం చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది వరి కోత మిషన్ల ధరలను విపరీతంగా పెంచేశారు. గంటకు రూ.3 వేలుకు గాను రూ. 4వేలు వరకు డిమాండ్ చేస్తుండటం రైతులకు భారంగా మారింది.
News November 17, 2025
కృష్ణా: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. జిల్లాలో వరి కోతలను రైతులు ముమ్మరం చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది వరి కోత మిషన్ల ధరలను విపరీతంగా పెంచేశారు. గంటకు రూ.3 వేలుకు గాను రూ. 4వేలు వరకు డిమాండ్ చేస్తుండటం రైతులకు భారంగా మారింది.


