News January 31, 2025
మచిలీపట్నం: బ్యాంకు ఉద్యోగి భారీ మోసం

కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన రూ.1.60 కోట్లు విలువ చేసే గోల్డ్ను రోల్డ్ గోల్డ్ పెట్టి మోసం చేస్తున్న బ్యాంకు ఉద్యోగిపై కేసు నమోదయింది. మచిలీపట్నం పోలీసులు కథనం.. పట్టణంలో ఓ బ్యాంకు ఉద్యోగి సోమశేఖర్ కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన గోల్డ్ ప్లేస్లో రోల్డ్ గోల్డ్ పెట్టి ఆ గోల్డ్ను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు.
Similar News
News December 24, 2025
గన్నవరంలో ఈనెల 27న మెగా జాబ్ మేళా

గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు 18-35 ఏళ్ల యువత అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
News December 24, 2025
గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు..!

గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపుల్లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారని, అనుభవం లేని అర్హత లేని వ్యక్తులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకొనే వారికి యాంటీబయోటిక్ మందులను విక్రయిస్తున్నారంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News December 24, 2025
నేటి నుంచి గుడివాడలో రాష్ట్ర స్థాయి పోటీలు

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఖో.. ఖో, బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించనున్నారు. 58వ రాష్ట్రస్థాయి ఖో.. ఖో సీనియర్ చాంపియన్షిప్ పోటీలు, సాయంత్రం నిర్వహించే 87వ జాతీయస్థాయి సీనియర్ బ్యాట్మెంటన్ చాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.


