News January 31, 2025

మచిలీపట్నం: బ్యాంకు ఉద్యోగి భారీ మోసం

image

కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన రూ.1.60 కోట్లు విలువ చేసే గోల్డ్‌ను రోల్డ్ గోల్డ్ పెట్టి మోసం చేస్తున్న బ్యాంకు ఉద్యోగిపై కేసు నమోదయింది. మచిలీపట్నం పోలీసులు కథనం.. పట్టణంలో ఓ బ్యాంకు ఉద్యోగి సోమశేఖర్ కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన గోల్డ్ ప్లేస్‌లో రోల్డ్ గోల్డ్ పెట్టి ఆ గోల్డ్‌ను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు.

Similar News

News February 16, 2025

తోట్లవల్లూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

తోట్లవల్లూరు మండలం యాకమూరు రైస్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్యూటీ ముగించుకొని బైక్‌పై వస్తున్న ఆర్టీసీ కండక్టర్ చీకుర్తి సురేష్ (47) వెనుక వైపు నుంచి ఎడ్ల బండిని ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 16, 2025

కంకిపాడు: వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారు కొనతనపాడులో ఉంటున్న వెంకటస్వామి ఈనెల 14న రాత్రి వాకింగ్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో భార్య కొందరితో కలిసి సాయంత్రం వెతకగా రోడ్డు పక్కన చనిపోయి కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

News February 16, 2025

MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం : DRO

image

పట్టభద్రుల MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం అని కృష్ణాజిల్లా సహాయ ఎన్నికల అధికారి, DRO కె చంద్రశేఖరరావు అన్నారు. సూక్ష్మ పరిశీలకులుగా నియమితులైన వారికి శనివారం కలెక్టరేట్‌లో వారి విధులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!