News December 12, 2024
మచిలీపట్నం: మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం

రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. మంత్రి రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన వెంకట రమణను హుటాహుటిన ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడ నుండి మచిలీపట్నం బయలుదేరారు. మరికాసేపట్లో మంత్రి మచిలీపట్నం రానున్నారు.
Similar News
News February 22, 2026
కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

కృష్ణా : సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు
మచిలీపట్నంలో యువకుడు ఆత్మహత్య
కోడూరులో ఉపాధ్యాయుడి వినూత్న బోధన
కృష్ణా : ఫార్మసీ పరీక్షా ఫలితాలు విడుదల
కృష్ణా : తల్లిని చూసేందుకు వెళుతూ.. కొడుకు మృతి
గుడివాడ : ట్రైన్లో రూ.14 లక్షల గోల్డ్ బ్యాగ్ మిస్
విజయవాడలో రేపు ఎమ్మెల్యేలు, మంత్రులకు క్రీడా పోటీలు
News February 22, 2026
గుడివాడ: ఫీజు రాయితీపై ప్రైవేట్ స్కూళ్ల మొండికేత

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, గుడివాడలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వీటిని బేఖాతరు చేస్తున్నాయి. మాకు ఆ జీవోల గురించి తెలియదు అంటూ యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MEO పలుమార్లు సూచించినా, స్కూళ్లలో విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తూనే ఉన్నారని ఆరోపిస్తున్నారు.
News February 22, 2026
కృష్ణా: ఈ మాస్టారు రూటే సెపరేటు..!

కోడూరు మండలం ఉల్లిపాలెం ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులను నేరుగా ప్రకృతిలోకి తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నారు. చేపల సాగు, మడ అడవుల సంరక్షణ, వ్యవసాయ పద్ధతులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు సైన్స్ అంశాలను ఎంతో సులభంగా అర్థం చేసుకుంటున్నారు.


