News March 21, 2025

మచిలీపట్నం: సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ 

image

దేశ శాంతిభద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం మచిలీపట్నం చేరుకోగా శుక్రవారం ఉదయం జడ్పీ కన్వెన్షన్ నుంచి ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణతో కలిసి కొంతదూరం సైకిల్ ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. 

Similar News

News November 24, 2025

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత అధికారులతో సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన అర్జీల పరిష్కార చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.