News April 6, 2024
మచిలీపట్నం: 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం
మచిలీపట్నం సముద్రంలో ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ జిల్లా మత్స్యశాఖకు శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ , మోటార్ బోట్లు ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటకు 61 రోజుల పాటు నిషేధించామని తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం ద్వారా మత్స్యసంపద పెరుగుతోందని తెలిపారు.
Similar News
News January 21, 2025
ఎస్పీని కలిసిన అవనిగడ్డ నూతన డీఎస్పీ విద్యశ్రీ
అవనిగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తాళ్లూరి విద్యశ్రీ సోమవారం కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర రావును మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి డీఎస్పీ పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అవనిగడ్డ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు.
News January 20, 2025
విజయవాడ: పీజీఆర్ఎస్కు 92 ఫిర్యాదులు
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చాయని డీసీపీ ఏబీటీఎస్. ఉదయారాణి తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
News January 20, 2025
‘కుష్టు’ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం: కలెక్టర్
కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి పిబ్రవరి 2వ తేది వరకు జిల్లాలో కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకిని ‘కుష్టు’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్లో కుష్టు వ్యాధి పరీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.