News June 4, 2024

మచిలీపట్నం: 40 వేల మెజారిటీతో దూసుకెళ్తున్న బాలశౌరి

image

మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో NDA కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం 41,574 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ రౌండ్లలో బాలశౌరి 1,32,678 ఓట్లు సాధించగా ఆయన ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ 91,104 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ ఇప్పటి వరకు 6,895 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు.

Similar News

News October 7, 2024

నేడు దుర్గమ్మ ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?

image

దసరా శరన్నవరాత్రులలో ఐదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని, చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని పండితులు తెలిపారు. శ్రీ చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలలో ప్రస్తావించబడిందన్నారు.

News October 7, 2024

మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన MLA సుజనా

image

రాజు సమర్థుడైతే ఆ రాజ్యం ముందు ప్రపంచమే మోకరిల్లుతుందని ప్రధాని మోదీని ఉద్దేశించి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా ఆదివారం ట్వీట్ చేశారు. ఒకప్పుడు సలహా కోసం ప్రపంచం వైపు చూసే స్థాయి నుంచి నేడు మోదీ నాయకత్వంలో అగ్రరాజ్యాలకు సలహాలు ఇచ్చే స్థాయికి భారత్ చేరుకుందని సుజనా పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకుకు సలహా ఇచ్చే ఉన్నత స్థితిలో దేశం నిలబడటానికి మోదీ నాయకత్వమే కారణమని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News October 6, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీ.ఏ.) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 25 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు 17 నుంచి 26 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.