News July 11, 2024

మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే అనుమతి: మేఘా స్వరూప్

image

అనంతపురం నగరంలో పర్యావరణహితం కోసం గురువారం అనంతపురం నగర మున్సిపల్ కమిషనర్ మేఘా స్వరూప్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితికి కేవలం మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు, థర్మాకోల్ వాడడానికి అనుమతి లేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి నగర ప్రజలందరూ ఈ నియమాలు పాటించి సహకరించవలసిందిగా కోరారు.

Similar News

News February 13, 2025

జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ వీసీని కలిసిన TCS అధికారులు

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బుధవారం ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావును TCS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ‘Corporate Social responsibility’ కింద యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంల గురించి ఇన్‌ఛార్జ్ వీసీతో కలిసి చర్చించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

News February 12, 2025

‘ఉద్యాన పంటల సాగు పెంపునకు కృషి చేయాలి’

image

అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 12, 2025

అనంత: ‘బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన బాలుడు.. వివరాలు తెలిస్తే చెప్పండి’

image

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కొండ మీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో ఓ బాలుడు తప్పిపోయాడు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే బుక్కరాయసముద్రం సీఐకి సమాచారం అందించాలని తెలిపారు.

error: Content is protected !!