News September 6, 2024

మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి: కడప కలెక్టర్

image

సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రజలకు సూచించారు. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయడం వల్ల గొప్ప మార్పులు సాధించవచ్చని ఆయన ప్రజలను కోరారు. చెరువులు జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గిద్దామని, మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని పిలుపునిచ్చారు.

Similar News

News September 19, 2025

చింతకుంటలో ఎరువుల పంపిణీని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్

image

దువ్వూరు మండలం చింతకుంటలోని రైతు సేవా కేంద్రంలో గురువారం జరిగిన యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ పరిశీలించారు. రైతులు యూరియా వినియోగాన్ని క్రమేనా తగ్గించాలని, దీని స్థానంలో నానో యూనియన్ వాడాలని సూచించారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News September 18, 2025

కడప: జాతీయ ప్రతిభా ఉపకార వేతన దరఖాస్తుకు అవకాశం

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతన పథకo ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని, దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30న చివరి గడువని డీఈవో శంషుద్దీన్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులలు పరీక్ష ఫీజు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 17, 2025

తిరుమలలో పులివెందుల వాసి మృతి

image

తిరుమలలో బుధవారం శ్రీవారి భక్తుడు మృతి చెందాడు. టీటీడీ అధికారుల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల తాలూకా పార్నపల్లికి చెందిన శ్రీవారి భక్తుడు తిరుమల అద్దె గదుల ప్రాంతంలోని ఓ బాత్రూంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.