News November 29, 2024

మడకశిర వద్ద బాలుడి దారుణ హత్య!

image

మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ నిన్న అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు మడకశిర సరిహద్దులోని కర్ణాటక అటవీ ప్రాంతంలో బాలుడు మృతిచెంది కనిపించాడు. దుండగులే ఎత్తుకెళ్లి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు సంబంధించి వాస్తవ వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Similar News

News October 15, 2025

పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మన దేశ వారసత్వం, పురాతన కట్టడాల గురించి తెలపాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు.

News October 15, 2025

ఈనెల 17 నుంచి జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

image

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈనెల 17 నుంచి జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు, సైన్స్ సెంటర్ క్యూరేటర్ బాల మురళీకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం మండల స్థాయిలో సెమినార్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామన్నారు.

News October 15, 2025

అనంతలో కేరళ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన

image

కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం జాతీయ అధ్యక్షుడు పీకే, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే అనంతపురం నగరానికి విచ్చేశారు. అనంతపురంలో ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రజా సమస్యలపై సింధూర అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలన్నారు.