News January 27, 2025
మడికొండ పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ

సెంట్రల్ జోన్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలతో పాటు సిబ్బంది, ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును సీపీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది మౌలిక వసతుల ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఇన్స్పెక్టర్ కిషన్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News September 16, 2025
చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.
News September 16, 2025
గోపాలపట్నంలో దారుణ హత్య

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
పోషకాహారంతో ఆరోగ్యకర జీవనం: ములుగు కలెక్టర్

పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 8వ రాష్ట్రీయ పోషణ్లో భాగంగా నెల రోజులు నిర్వహించే కార్యక్రమాలపై ఐసీడీఎస్, హెల్త్, విద్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.