News March 7, 2025

మణుగూరులో రోడ్డు ప్రమాదం నలుగురికి గాయాలు

image

మణుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం వద్ద కారు టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కొత్తగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News October 25, 2025

జిల్లాలో పాఠశాలలకు 3 రోజులు సెలవులు: కలెక్టర్

image

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 27 నుంచి 29 వరకు 3 రోజులు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ప్రకటించారు. ఉపాధ్యాయులు మాత్రం స్కూళ్లకు హాజరు కావాలన్నారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలలోని విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు. సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 25, 2025

‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పకడ్బందీగా పూర్తి చేయాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివిజన్ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దశలవారీగా, లోపాలకు తావు లేకుండా పూర్తి చేస్తామని వివరించారు.

News October 25, 2025

విద్యార్థులు ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలి: బాలలత

image

విద్యార్థులు వారికి ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేసిన బాలలత సూచించారు. వరంగల్ నిట్‌లో జరుగుతున్న టెక్నోజియాన్ రెండో రోజు ఆమె చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచిస్తూ, విజయవంతమైన వ్యక్తులు తమ సమయాన్ని ఆలోచన, సృష్టికి వినియోగిస్తారని పేర్కొన్నారు.