News August 29, 2024
మణుగూరు: తండ్రిని చంపిన కుమారుడు అరెస్టు

కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులోని బుచ్చి రాములును ఆయన కుమారుడు సూర్యం మంగళవారం కర్రలతో కొట్టి చంపాడు. నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సతీశ్ వివరాల ప్రకారం.. కొన్ని కారణాల వల్ల సూర్యం భార్య 8 ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మద్యానికి బానిసైన నిందితుడు ఆస్తి కోసం తల్లిదండ్రులతో తరచూ గొడవ పడేవాడు. ఈక్రమంలో కర్రలతో తండ్రిపై దాడి చేయగా అతడు మృతి చెందాడు.
Similar News
News December 15, 2025
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం: సీపీ

ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను సోమవారం సీపీ ఆవిష్కరించారు. పోస్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 15, 2025
రెండో విడత ఎన్నికలు.. ఏ పార్టీ ఎన్ని గెలిచిందంటే..!

ఖమ్మం జిల్లాలో జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ-117, BRS-40, CPI-04, CPM-14, TDP-1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు. అటు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి.
News December 15, 2025
ఖమ్మం జిల్లాలో రెండో దశ ఎన్నికలు.. పార్టీల బలాబలాలు

▶ కూసుమంచి(41 స్థానాలు): CONG-28, BRS-12, ఇతరులు-1
▶ కామేపల్లి(24): CONG-16, BRS-6, CPI-1, TDP-1
▶ ఖమ్మం రూరల్(21): 21 CONG-9, BRS-5, CPI-3, CPM-4
▶ ముదిగొండ(25): CONG-17, BRS-2, CPM-6
▶ నేలకొండపల్లి(32): CONG-20, BRS-7, CPM-2, ఇతరులు-3
▶ తిరుమలాయపాలెం(40): CONG-27, BRS-8, CPM-2, ఇతరులు-3.


