News August 29, 2024
మణుగూరు: తండ్రిని చంపిన కుమారుడు అరెస్టు

కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులోని బుచ్చి రాములును ఆయన కుమారుడు సూర్యం మంగళవారం కర్రలతో కొట్టి చంపాడు. నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సతీశ్ వివరాల ప్రకారం.. కొన్ని కారణాల వల్ల సూర్యం భార్య 8 ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మద్యానికి బానిసైన నిందితుడు ఆస్తి కోసం తల్లిదండ్రులతో తరచూ గొడవ పడేవాడు. ఈక్రమంలో కర్రలతో తండ్రిపై దాడి చేయగా అతడు మృతి చెందాడు.
Similar News
News November 22, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} తిరుమలాయపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} ఖమ్మంలో నేడు జాబ్ మేళా
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 22, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} తిరుమలాయపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} ఖమ్మంలో నేడు జాబ్ మేళా
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 22, 2025
ఖమ్మం: గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. వీటీజీ/బీఎల్వీ సెట్ రాసిన వారికి ప్రాధాన్యత, ఇతరులకు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.


