News March 19, 2025

మత్కేపల్లిలో రూ.1.50లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

image

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఫారసు మేరకు మత్కేపల్లి గ్రామానికి చెందిన బండి స్వాతి రూ.60,000, పగడాల శీను రూ.40,000, పగడాల బాబురావు రూ. 50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చింతకాని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News March 20, 2025

ఖమ్మం: మహా ప్రస్థానం.. మహాద్భుతంగా ఉండాలి: తుమ్మల

image

మనిషి మృతి చెందిన తర్వాత చివరి మజిలీ మహా “ప్రస్థానం” మహా అద్భుతంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల ఆదేశించారు. బుధవారం హైదరాబాదులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, సత్తుపల్లిలో మోడల్ వైకుంఠ దామాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అగస్త్య, సత్తుపల్లి కమిషనర్ నరసింహ ఆదేశించారు.

News March 20, 2025

ఖమ్మం: పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

మంచి మనస్సుతో అధికారులు నాణ్యతతో పనులు పూర్తి చేసి బాలల సదనం సుందరీకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్, నగరంలోని బాల సదనం భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల సదనంలో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులు, పిల్లలకు ఆహ్లాదం కోసం కల్పించాల్సిన ఆట పరికరాలు, గ్రీనరీ, వాల్ పెయింట్, అదనపు వసతుల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

News March 20, 2025

ఖమ్మం: పదో తరగతి పరీక్షలకు వేళాయే!

image

ఖమ్మం జిల్లాలో టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 97 పరీక్ష కేంద్రాల్లో 16,788 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. CC కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ శర్మ చెప్పారు. 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 97 సిట్టింగ్ స్క్వాడ్స్, 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 98 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1595 మందిని ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించారు.

error: Content is protected !!