News March 2, 2025

మత్స్యకారుల అభివృద్ధికి కృషి: కేంద్ర మంత్రి

image

‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశించారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో మత్స్య శాఖ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను విన్నారు, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News March 15, 2025

తాడేపల్లిగూడెం చేరిన తండ్రి, పిల్లల మృతదేహాలు

image

కాకినాడ సుబ్బారావు నగర్లో తన ఇరువురు <<15765374>>పిల్లల్ని<<>> చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో తండ్రి వానపల్లి చంద్ర కిషోర్, పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6) భౌతిక కాయాలు శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెం చేరుకున్నాయి. ఓఎన్జీసీ అంబులెన్స్ లో వారి భౌతిక కాయాలను తాడేపల్లిగూడెం పట్టణం పాతూరు అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వెనుక ఉన్న మృతుడు చంద్రకిషోర్ తండ్రి సూరిబాబు నివాసానికి తీసుకొచ్చారు.

News March 15, 2025

భీమవరంలో యువతి ఆత్మహత్యాయత్నం

image

భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చిన్న వంతెన మీద నుంచి మురికి కాలవలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు, శ్రీనివాస్ అనే యువకుడు ఆ యువతిని రక్షించారు. యువతికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య ఏంటి అని అడగ్గా తమ తల్లిదండ్రులు విడిపోతున్నారని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది.

News March 15, 2025

తణుకు: సీఎం సభలో కీ పాయింట్స్.

image

తణుకులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పర్యటించారు. అందులో కొన్ని కీ పాయింట్స్…
1) పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పార్క్ శుభ్రం చేశారు.
2) మార్కెట్ వ్యాపారస్తులతో ముఖాముఖి.
3) రాగి పిండితో తయారుచేసిన కప్పులను తిలకించారు.
4) తణుకులో 42 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
5) అక్టోబర్ 2న చెప్పకుండా వస్తా అన్నారు.
6) ప్రకృతిని నాశనం చేస్తున్న ప్లాస్టిక్.

error: Content is protected !!