News January 30, 2025
మత్స్యకారుల జీవనోపాధి కాపాడాలి: డా.రాజేంద్రసింగ్

1000 కి.మీ.ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఏపీలో పరిశ్రమల కాలుష్యం వలన సుమారు 2లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నారని డా.రాజేంద్రసింగ్ అన్నారు. విశాఖలో తీర ప్రాంతాన్ని ఆయన గురువారం సందర్శించారు. మత్స్యకారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తాబేళ్లు మృత్యువాత బాధాకరమన్నారు. దీనిపై పొల్యూషన్ బోర్డు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని కోరారు.
Similar News
News September 15, 2025
విశాఖలో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్కు సరెండర్ చేశారు. ఎంవీపీ లా అండ్ ఆర్డర్ సీఐగా ప్రసాద్, వెస్ట్ జోన్ క్రైమ్కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్కు ప్రభాకరరావు, పోలీస్ కంట్రోల్ రూమ్కు సిటీ వీఆర్లో ఉన్న భాస్కరరావును నియమించారు.
News September 15, 2025
విశాఖ: బస్సుల్లో రద్దీ.. ప్రయాణ సమయాలు మార్చుకోవాలని పిలుపు

స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా. 4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందన్నారు. దీంతో ఉ.10 నుంచి, సా.7 తర్వాత ప్రయాణాలు చేసేలా చూసుకోవాలని మహిళలు, ప్రయాణికులను కోరారు.
News September 15, 2025
మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.