News January 30, 2025
మత్స్యకారుల జీవనోపాధి కాపాడాలి: డా.రాజేంద్రసింగ్

1000 కి.మీ.ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఏపీలో పరిశ్రమల కాలుష్యం వలన సుమారు 2లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నారని డా.రాజేంద్రసింగ్ అన్నారు. విశాఖలో తీర ప్రాంతాన్ని ఆయన గురువారం సందర్శించారు. మత్స్యకారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తాబేళ్లు మృత్యువాత బాధాకరమన్నారు. దీనిపై పొల్యూషన్ బోర్డు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని కోరారు.
Similar News
News February 18, 2025
విశాఖ: రెండు రైళ్లు రద్దు

కార్యాచరణ పరిమితుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. రానుపోను రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ✔ ఫిబ్రవరి 21న సంత్రాగచ్చి-ఎంజీఆర్ చెన్నై ఎక్స్ప్రెస్ (22807)✔ ఫిబ్రవరి 18న షాలిమర్-విశాఖ ఎక్స్ ప్రెస్(22853) రద్దు చేశారు.
News February 18, 2025
విశాఖకు చేరుకున్న ఎమ్మెల్సీ బ్యాలెట్ పత్రాలు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బ్యాలెట్ పత్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫోటోలు, ఇతర వివరాలతో కూడిన నివేదికలను స్థానిక అధికారులు ఇప్పటికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.
News February 18, 2025
కావ్యరచనకు ఆధ్యుడు వాల్మీకి మహర్షి: చాగంటి

వాల్మీకి మహర్షి కావ్యరచనకు ఆధ్యుడని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విశాఖ మధురవాడ గాయత్రీ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణం ఉపన్యాసాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా కావ్యాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడం వాల్మీకి మహర్షికే సాధ్యమన్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలని రామాయణంలో స్వామి హనుమ వివరించి తెలిపారని పేర్కొన్నారు. తర్వాత చేస్తే ప్రయోజనం శూన్యమన్నారు.