News December 31, 2024

మత్స్యావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు మంగళవారం దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి మంత్రోచ్చారణలతో క్రతువును కమనీయంగా కొనసాగించారు. స్వామివారు మత్స్యావతారంలో దర్శనమివ్వడంతో భక్తులు మురిసిపోయారు. తిరువీధిసేవ ఆధ్యాత్మికతను చాటగా సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బుధవారం కూర్మావతారం దర్శనం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

Similar News

News November 17, 2025

లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం: CP

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్‌ అదాలత్‌‌కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు-605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా రూ.92,45,636 బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.

News November 16, 2025

స్థిరాస్తి లాటరీల మోసం.. అధికారులు దృష్టి సారించాలి

image

ఖమ్మం జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘1000 కట్టు-ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత ప్రకటనలతో లాటరీలు నిర్వహిస్తూ ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆర్థిక మోసాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అమాయక ప్రజలను ఈ మోసాల నుంచి రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.

News November 16, 2025

ఖమ్మం: అంగన్వాడీల్లో కనిపించని సమయపాలన..

image

జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బదులు ఆలస్యంగా కేంద్రాన్ని తెరవడం, అలాగే సాయంత్రం 4 గంటలకు ముందే 3 గంటలకే ఇంటికి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ వెంటనే దృష్టి సారించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.