News March 23, 2024

మదనపల్లి: చెరువులో భవన కార్మికుడు మృతదేహం కలకలం

image

చెరువులో దూకి భవన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం మదనపల్లి మండలంలో చోటుచేసుకుంది. తాలూకా సిఐ ఎన్ శేఖర్ కథనం మేరకు.. బసినికొండ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న కొండయ్య (37) వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. శనివారం బసినికొండ పొంతల చెరువులోని నీటిపై మృతదేహం తేలియాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొండయ్య మృతదేహాన్ని వెలికి తీశారు.

Similar News

News October 28, 2025

అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోండి: కలెక్టర్

image

తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సుమిత్ కుమార్ తెలిపారు. దీనిపై ఎటువంటి పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. వార్తా సమాచారం కోసం ఫోన్లలో గమనిస్తూ ఉండాలని కోరారు. అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.

News October 28, 2025

చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.

News October 27, 2025

చిత్తూరు జిల్లాలో రేపు కూడా స్కూళ్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.