News March 4, 2025
మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: షాజహాన్ బాషా

మదనపల్లెలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం అసెంబ్లీ వేదికగా స్పీకర్ను కోరారు. ఇది నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. 1860 నుంచి మదనపల్లె పరిపాలన రాజధానిగా గుర్తింపు పొందిందన్నారు. ఆటోనగర్, ఐటి కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని సీఎంను కోరారు.
Similar News
News October 15, 2025
తహశీల్దార్ ఫిర్యాదు FIR కాలేదు ఎందుకో.?

తనపై దౌర్జన్యం జరిగిందని లింగసముద్రం తహశీల్దార్ స్వయంగా ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు అదేరోజు FIR ఎందుకు చేయలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి ఫిర్యాదు ఇస్తే అది కూడా FIR కాకపోవడం చర్చనీయాంశమైంది. లింగసముద్రం SI నారాయణ తీరు పట్ల తహశీల్దార్ సైతం అసహనం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించకపోతే ఎలా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News October 15, 2025
ఖమ్మం: ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

కామారెడ్డి(D) బిక్కనూరు(M) జంగంపల్లిలో హైవేపై రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టగా, ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు ముగ్గురు ఖమ్మం(D) బోనకల్(M) ముష్టికుంటకు చెందిన వారు కాగా మరొకరు ఆదిలాబాద్కు చెందిన కిషన్గా గుర్తించారు. ముష్టికుంటకు చెందిన జాస్లీన్ తన చిన్న కుమారుడు జాడ్సన్కు టీకా వేయించేందుకు తండ్రి కిషన్తో కలిసి కామారెడ్డికి వెళ్లారు.
News October 15, 2025
రానున్న 3 గంటల్లో సత్యసాయి జిల్లాలో భారీ వర్షం

రానున్న 3 గంటల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చెట్ల కింద ఎవరూ నిలబడకూడదని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లాలోని హిందూపురం, సోమందేపల్లి తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం పడుతోంది.