News March 4, 2025

మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: షాజహాన్ బాషా

image

మదనపల్లెలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం అసెంబ్లీ వేదికగా స్పీకర్‌ను కోరారు. ఇది నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. 1860 నుంచి మదనపల్లె పరిపాలన రాజధానిగా గుర్తింపు పొందిందన్నారు. ఆటోనగర్, ఐటి కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని సీఎంను కోరారు.

Similar News

News March 22, 2025

రామకృష్ణాపూర్‌లో శ్రీకాంత్ సూసైడ్.. UPDATE

image

రామకృష్ణాపూర్‌లో <<15839741>>శ్రీకాంత్ <<>>ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ రాజశేఖర్ వివరాలు.. పట్టణానికి చెందిన శ్రీకాంత్ ఓ కన్స్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, కంపెనీలోని ఆర్థిక లావాదేవీలలో ముగ్గురు తనను వేధిస్తున్నారంటూ సూసైట్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు తలుపు తెరచి చూడగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదైంది.

News March 22, 2025

రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మావల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్, లారీ, కారు ఇలా ఒకదానినొకటి ఢీకొన్నాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న దేవేందర్‌గా ఒకరిని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2025

టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

image

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.

error: Content is protected !!