News September 30, 2024

మదనపల్లెలో టమాటా కిలో రూ. 60

image

మదనపల్లెలో టమాటా KG రూ.60 పలికింది. దిగుబడి తక్కువగా ఉండటంతో వ్యవసాయ మార్కెట్లో ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా కిలో ధర రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. 25 కిలోల క్రేట్ ధర రూ.1,500వరకు పలికిందని అధికారులు పేర్కొన్నారు. బయటరాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలేకపోవడంతో ఇక్కడి టమాటాకు డిమాండ్ పెరిగింది. వారంరోజులుగా కిలో రూ.44నుంచి రూ.50 వరకు పలకగా ఆదివారం రూ.60 చేరింది.

Similar News

News October 21, 2025

చిత్తూరు: సెల్యూట్.. సీఐ రుషికేశవ

image

కొందరు పోలీసులు చనిపోయినా ప్రజల మనసులో ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ కోవకే చెందిన వారే సీఐ రుషికేశవ అలియాస్ శివమణి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో ప్రొబేషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి SI, CIగా పలమనేరు, తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, PTM, గంగవరం, ములకలచెరువు, మదనపల్లెలో పనిచేశారు. 2022 జులై 8న మృతి చెందారు.
#నేడు పోలీసుల అమరవీరుల దినోత్సవం

News October 21, 2025

చిత్తూరు: ఇకనైనా మైనింగ్ మాఫియాకి చెక్ పడేనా..?

image

చిత్తూరులో కొంత కాలంగా రాయల్టీ పైకానికి బ్రేక్ పడింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ టెండర్ గత నెలాఖరుతో ముగిసింది. నేరుగా మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో గ్రానైట్, గ్రావెల్ తరలింపు కొనసాగుతోంది. నూతన టెండర్ ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరో 3 నెలలు రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి పొడిగిస్తారా..? లేక నూతన టెండర్ ఖరారు చేస్తారా? అనే అంశం మరి కొన్నిరోజుల్లో తేలనుంది.

News October 21, 2025

మిమ్మల్ని చిత్తూరు ప్రజలు మరవలేరు..!

image

2020 నవంబర్ 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఐరాల(M) రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం పొందారు. 2007లో చిత్తూరులో CKబాబుపై జరిగిన హత్యాయత్నంలో గన్‌మెన్స్ హుస్సేన్ బాషా, సురేంద్ర అమరులయ్యారు. 2017లో పలమనేరు అడవుల్లో మహిళను అత్యాచారం చేయబోయారు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ జవహర్ నాయక్, హోంగార్డు దేవంద్ర చనిపోయారు.
#నేడు అమరవీరుల దినోత్సవం