News March 15, 2025

మదనపల్లెలో ‘నారికేళి’ సినిమా షూటింగ్

image

వైష్ణవి మూవీ మేకర్స్ సమర్పణలో ‘నారికేళి’ అనే సినిమా షూటింగ్ మదనపల్లెలో ప్రారంభమైంది. శుక్రవారం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం హీరో కిరణ్ గోవింద్ సాయి, హీరోయిన్ స్వాతి రెడ్డిపై దర్శకుడు సీ.రెడ్డిప్రసాద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో స్థానిక నూతన నటీనటులతో సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందించనున్నట్లు నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు.

Similar News

News October 24, 2025

వారు మున్సిపాలిటీల్లోనూ పోటీ చేయొచ్చు!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్‌తో పాటు పురపాలక చట్టాలను కూడా సవరించనున్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆర్డినెన్స్‌ను ఇవాళ ప్రభుత్వం గవర్నర్‌కు పంపనుంది.

News October 24, 2025

మద్యం టెండర్లు తగ్గుముఖం.. లక్ష్యం చేరని ఎక్సైజ్‌

image

యాదాద్రి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియలో లక్ష్యం(టార్గెట్) చేరుకోలేకపోయింది. గత ఏడాది 3,969 టెండర్లు రాగా, ఈసారి ప్రభుత్వ ధర రూ.లక్ష పెంచడంతో కేవలం 2,776 టెండర్లు మాత్రమే వచ్చాయి. టార్గెట్‌ రీచ్‌ కోసం ఎక్సైజ్ అధికారులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయినప్పటికీ, ఆదాయం రూపంలో మాత్రం గతం కంటే రూ.4 కోట్లు అదనంగా సమకూరింది.

News October 24, 2025

ఇళ్ల కోసం అర్హులను గుర్తించండి: మంత్రి ఆదేశాలు

image

నవంబర్ 5లోగా ఆన్లైన్లో ఇళ్ల కోసం కోసం దరఖాస్తు చేసుకొని విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సూచించారు. అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు.