News June 13, 2024
మదనపల్లెలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య

ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి దారుణ హత్యకు గురైన ఘటన మదనపల్లెలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికంకాలనీ, ఆంజనేయస్వామి గుడి వద్ద కాపురం ఉంటున్న టీచర్ దొరస్వామి(62)ను ఎవరో తన ఇంటిలోనే పథకం ప్రకారం మరణాయుధాలతో దారుణంగా హత్యచేసి పరారయ్యారు. మృతదేహాన్ని 1టౌన్, తాలూకా సిఐలు వల్లి భాష, శేఖర్ లు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 22, 2025
చిత్తూరు: పాఠశాలలకు సెలవు

రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. అలాగే రేపు పాఠశాలలకు సెలవులు సెలవులు ప్రకటిస్తూ ఎంఈవోలకు డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 21, 2025
చిత్తూరు: సెల్యూట్.. సీఐ రుషికేశవ

కొందరు పోలీసులు చనిపోయినా ప్రజల మనసులో ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ కోవకే చెందిన వారే సీఐ రుషికేశవ అలియాస్ శివమణి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో ప్రొబేషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి SI, CIగా పలమనేరు, తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, PTM, గంగవరం, ములకలచెరువు, మదనపల్లెలో పనిచేశారు. 2022 జులై 8న మృతి చెందారు.
#నేడు పోలీసుల అమరవీరుల దినోత్సవం
News October 21, 2025
చిత్తూరు: ఇకనైనా మైనింగ్ మాఫియాకి చెక్ పడేనా..?

చిత్తూరులో కొంత కాలంగా రాయల్టీ పైకానికి బ్రేక్ పడింది. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ టెండర్ గత నెలాఖరుతో ముగిసింది. నేరుగా మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో గ్రానైట్, గ్రావెల్ తరలింపు కొనసాగుతోంది. నూతన టెండర్ ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరో 3 నెలలు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి పొడిగిస్తారా..? లేక నూతన టెండర్ ఖరారు చేస్తారా? అనే అంశం మరి కొన్నిరోజుల్లో తేలనుంది.