News March 22, 2025
మదనపల్లెలో మైనర్ బాలికకు పెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు

మదనపల్లె మండలంలో మైనర్ బాలికకు పెళ్లి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మదనపల్లె మండలం బొమ్మనచెరువు పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికకు వారం క్రితం తండ్రికి తెలియకుండా తల్లి పెళ్లి చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు బాలిక తల్లికి ఫోన్ చేసి స్టేషక్కు రావాలన్నారు.
Similar News
News March 29, 2025
TODAY HEADLINES

✒ మయన్మార్, థాయిలాండ్లో భూకంపం.. దాదాపు 180 మంది మృతి
✒ భూకంప ప్రభావిత దేశాలకు అండగా ఉంటాం: మోదీ
✒ కేంద్ర ఉద్యోగులకు 2% DA పెంపు
✒ AP: 31న జరగాల్సిన టెన్త్ పరీక్ష APR 1కి వాయిదా
✒ తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CBN
✒ ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు
✒ ఇంటి స్థలం లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: పొంగులేటి
✒ మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: KTR
✒ మే 1 నుంచి ATM ఛార్జీల పెంపు
News March 29, 2025
నోటిఫికేషన్ విడుదల

AP: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (PGECET) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్/బీఫార్మసీ పాసైన లేదా చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 120 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
News March 29, 2025
ఆర్సీబీ చేతిలో చెన్నై చిత్తు

IPL: సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు.. చెన్నైని సునాయాసంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 196/7 రన్స్ చేసింది. అనంతరం చెన్నై 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రచిన్ ఒక్కడే 41 పరుగులతో రాణించారు. చివర్లో ధోనీ (30*) రెండు సిక్సర్లు కొట్టి అభిమానుల్లో జోష్ నింపారు.