News July 9, 2024
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థులకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఎస్సై వెంకటసుబ్బయ్య వివరాల ప్రకారం.. స్థానిక నీరుగట్టువారిపల్లె ఎస్టీ హాస్టల్ విద్యార్థులు ముగ్గురు బైక్పై చంద్ర కాలనీ వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాలనీ వద్ద వారి బైకు అదుపుతప్పి కింద పడ్డారు. క్షతగాత్రల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.
Similar News
News November 23, 2025
చిత్తూరు: తండ్రి రిటైర్డ్ మిలిటరీ.. కొడుకు దొంగ

బెంగళూరు ATM చోరీ కేసులో <<18367776>>దోచుకున్న<<>> డబ్బులు దాచిపెట్టిన నవీన్ తండ్రి ఓ రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి. గ్రామంలో ఆయనకు మంచి పేరుంది. అయితే ఆయన ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు నవీన్కు మూడు నెలల క్రితమే వివాహమైంది. ATM చోరీ కేసులో నవీన్ ఇంట్లో దాచిపెట్టిన రూ.5.60 కోట్లను స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు అతడిని ఇదివరకే అరెస్ట్ చేశారు.
News November 23, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.133 నుంచి రూ.140, మాంసం రూ.193 నుంచి 207 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.219 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 22, 2025
ఫార్మర్ యాప్ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకు, అలాగే డిసెంబరు 3వ తేదీన నిర్వహించనున్న “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్తో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ యాప్తో రైతుకు చేరువగా సాంకేతికత ఉంటుందన్నారు. ఫార్మర్ యాప్ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని ఆయన ఆదేశించారు.


