News April 10, 2024

మదనపల్లె: ఇరు వర్గాల ఘర్షణలో ఇద్దరికి గాయాలు

image

మద్యం మత్తులో ఆటో డ్రైవర్లు గొడవపడి గాయపడ్డ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు వివరాల ప్రకారం.. మదనపల్లె మోతినగర్లో ఆటో నడిపే ఖాజా(50), రెడ్డెప్ప(52)లు కలసి మిషన్ కాంపౌండ్ వద్ద మద్యం తాగారు. అనంతరం ఇంటికివచ్చే క్రమంలో ఇద్దరు గొడవపడి ఒకరి నొకరు కొట్టుకున్నారు. ఈగొడవలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని, సహచరులు గమనించి వెంటనే స్థానిక జిల్లాఆస్పత్రికి తరలించారు.

Similar News

News March 25, 2025

ఈసారైనా రామకుప్పం ఎంపీపీ ఎన్నిక జరిగేనా?

image

రామకుప్పం మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఎంపీపీ ఎన్నిక 5 సార్లు వాయిదా పడింది. మొత్తం 15 మంది MPTCలకు గాను వైసీపీకి చెందిన సుమారు 7 మంది ఎంపీటీసీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా ఈ ఎన్నికను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. వైస్ ఎంపీపీ పదవికి ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ఈసారైనా ఎన్నిక జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.

News March 25, 2025

నాగలాపురం: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

ఉ.చిత్తూరు(D) నాగలాపురం(M)లోని ఓ కాలనీలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో చరణ్(23)పై కేసు నమోదు చేసినట్లు SI సునీల్ కుమార్ తెలిపారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.

News March 25, 2025

చిత్తూరు: మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఇందుకోసం మార్చి 10 నుంచి దరఖాస్తులను బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.

error: Content is protected !!