News June 14, 2024

మదనపల్లె: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తండ్రినే చంపేసింది..!

image

మదనపల్లెలో టీచర్ దొరస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇష్టం లేని పెళ్లి ఖాయం చేయడంతో దొరస్వామి కుమార్తే చపాతి కర్ర, ఇనుప అట్టతో కొట్టి చంపినట్లు తెలిపింది. హరితను పోలీసులు అదుపులోకి తీసుకుని,హత్యకు వాడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రేమ విషయమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రియుడితో కలిసి ఉండడాన్ని గమనించి తండ్రి మందలించారని..ప్రియుడితో కలిసి హత్య చేసి ఉంటుందని అంటున్నారు.

Similar News

News May 7, 2025

28న చిత్తూరులో జాబ్ మేళా

image

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

News May 7, 2025

సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు 

image

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

News May 7, 2025

చిత్తూరు: 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

image

చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం అధికమవుతోంది. శుక్రవారం 4 మండలాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నగరి, తవణంపల్లెలో 41.2, శ్రీరంగరాజపురం-41, సదుం-40.7, చిత్తూరులో 39.4, బంగారుపాలెం-38.7, యాదమరి-38.6, పులిచెర్ల, పూతలపట్టు, సోమల, వెదురుకుప్పం-38.4, రొంపిచెర్ల-38.1, గంగవరం, పెద్దపంజాణి-38, చౌడేపల్లె, గంగాధర నెల్లూరు, ఐరాల, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, విజయపురంలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.