News April 6, 2024
మదనపల్లె: ఈనెల 17వరకు ఓటు నమోదుకు అవకాశం

18 ఏళ్ళు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా అధికారులు, నాయకులు కృషి చేయాలని మదనపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ హరిప్రసాద్ ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాజకీయ నాయకులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ.. ఈనెల17 వరకు 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులు కొత్త ఓటరుగా నమోదు చేసుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు.
Similar News
News October 20, 2025
చిత్తూరులో PGRS రద్దు

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.
News October 20, 2025
ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
News October 19, 2025
ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.