News April 6, 2024

మదనపల్లె: ఈనెల 17వరకు ఓటు నమోదుకు అవకాశం

image

18 ఏళ్ళు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా అధికారులు, నాయకులు కృషి చేయాలని మదనపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ హరిప్రసాద్ ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాజకీయ నాయకులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ.. ఈనెల17 వరకు 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులు కొత్త ఓటరుగా నమోదు చేసుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు.

Similar News

News November 24, 2025

చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

image

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

News November 24, 2025

చిత్తూరు: మట్టి కోసం TDP పరువు తీసేస్తున్నారు..!

image

చిత్తూరు జిల్లాలో గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. పూతలపట్టులో గ్రావెల్ తరలింపు విషయంలో TDP నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారట. ఇదే విషయమై ఐరాలకు చెందిన ఓ TDP కార్యకర్త ఆడియో వైరల్‌గా మారింది. గ్రావెల్ విషయమై TDPలో వర్గాలు ఏర్పడినా MLA మౌనంగా ఉండటాన్ని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారట. తిరుపతి జిల్లాలోనూ <<18368996>>గ్రావెల్ <<>>తరలింపు జోరుగా జరుగుతోంది.

News November 23, 2025

చిత్తూరు జిల్లా అధికారులకు గమనిక

image

చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలని డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ వారి ముందస్తు అనుమతి లేకుండా సబార్డినేట్ అధికారులను డిప్యూట్ చేయకూడదన్నారు. ఈ పీజేఆర్ఎస్ నిర్వహణపై కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి ఇప్పటికే అత్యవసర సందేశాన్ని పంపినట్లు డీఆర్వో వివరించారు.