News April 16, 2025
మదనపల్లె: ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటి పాలెం వద్ద రైతులు వన్య ప్రాణుల నుంచి పంట రక్షణకు పొలాల చుట్టూ అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయాన్నే గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి సమీపంలోకి చిరుత రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2026
నస్పూర్: విద్యార్థులకు సులభంగా జీర్ణమయ్యే పౌష్ఠికాహారాన్ని అందించాలి

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో సులభంగా జీర్ణమయ్యే పౌష్ఠికాహారాన్ని అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం నస్పూర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
News February 26, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ భద్రాద్రి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
✓ అశ్వాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
✓ ఇల్లందు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
✓ అశ్వారావుపేట డ్రంక్&డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
✓ టేకులపల్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✓ బూర్గంపాడు: ట్రాఫిక్ బూతే ఆమెకు ఇల్లు
✓ డయల్ 100కు తక్షణమే స్పందించాలి: భద్రాద్రి ఎస్పీ
News February 26, 2026
మెదక్: రూ.2.71 లక్షల టాక్స్ చెల్లించిన ఆర్టీసీ

మెదక్ ఆర్టీసీ డిపోకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ రూ. 2,71,801 చెక్కును డిపో మేనేజర్ సురేఖ బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.


