News June 5, 2024

మదనపల్లె: ఉరి వేసుకుని ఆత్మహత్య

image

కుటుంబ సమస్యలతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మదనపల్లె మండలంలో జరిగిందని సీఐ శేఖర్ తెలిపారు. కోటవారిపల్లె తండాకు చెందిన చిన్నరెడ్డప్పనాయక్ కుమారుడు కృష్ణానాయక్(35) ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. భార్య అమ్రూ కూలి పనులకు వెళ్లడంతో ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిచూడగా భర్త చనిపోవడంతో బోరున విలపించింది.

Similar News

News November 18, 2025

చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.

News November 18, 2025

చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.

News November 18, 2025

చిత్తూరు జిల్లాలో 27మందిపై క్రమశిక్షణ చర్యలు

image

చిత్తూరు జిల్లా సచివాలయ సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాక్ ఇచ్చారు. ‘జిల్లాలో 612సచివాలయాల్లో 4,477మంది పనిచేయాల్సి ఉంది. 4,040మంది విధులు నిర్వహిస్తుండగా 437మంది డ్యూటీకి రావడం లేదు. ఇందులో 152మంది మెడికల్ లీవ్‌, 251 మంది డిప్యుటేషన్‌పై వేరేచోట పనిచేస్తున్నారు. అనధికారికంగా సెలవుపై ఉన్న 27మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మెడికల్ లీవు వాళ్లను మరోసారి చెక్ చేయాలి’ అని కలెక్టర్ ఆదేశించారు.