News December 10, 2024
మదనపల్లె: కొడవలితో 10వ తరగతి విద్యార్థి హల్చల్

రాయచోటిలో విద్యార్థుల దాడిలో ఓ టీచర్ మృతిచెందిన ఘటన మరువక ముందే మదనపల్లెలో ఆ తరహా ఘటనే వెలుగు చూసింది. నీరుగట్టువారిపల్లెలోని ఓ స్కూల్లో 10వ తరగతి విద్యార్థి బ్యాగులో సోమవారం కొడవలి దాచుకుని వెళ్లాడు. క్లాస్లోని తోటి విద్యార్థులకు కొడవలి చూపించడంతో వారు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన టీచర్లు, హెచ్ఎం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి విద్యార్థి పేరంట్స్కు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Similar News
News July 5, 2025
చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

2020 జులై 20వ తేదీన మైనర్ బాలికపై రామకృష్ణ(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2025 జులై 4వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన దిశ డీఎస్పీ బాబు ప్రసాద్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చౌడేపల్లి సీఐ భూపాల్, ఎస్సై శివశంకర్లను జడ్జ్ అభినందించారు.
News July 5, 2025
చిత్తూరు: బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

పోలీసు శాఖలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్పీ మణికంఠ శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ బాబు సతీమణి మాధవి, గుడిపల్లి స్టేషన్లో మృతి చెందిన లక్ష్మీ భర్త ఆనంద్కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.
News May 8, 2025
మంత్రి లోకేశ్తో ఎమ్మెల్యే థామస్ భేటీ

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.