News May 11, 2024

మదనపల్లె టమోటా మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మదనపల్లె టమోటా మార్కెట్‌కు ఆర్‌ఓ హరిప్రసాద్ 2రోజులు సెలవు ప్రకటించారు. మదనపల్లెలో ఎన్నికలు 13న జరగనున్న నేపథ్యంలో ఐదు పోలింగ్ కేంద్రాలు నీరుగట్టువారిపల్లెలో ఉన్నాయి. దీంతో మదనపల్లె టమోటా మార్కెట్ యాడ్‌ను ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం సాయంత్రం 7గంటల వరకు ఎలక్షన్ ఆఫీసర్ల అధీనంలో ఉంటుంది. ఆది, సోమవారాలు టమోటా రైతులు మార్కెట్‌కు టమోటాలు తీసుకురావద్దని కోరారు.

Similar News

News November 21, 2025

బెంగళూరులో రూ.7కోట్ల దోపిడీ.. చిత్తూరులో కారు

image

బెంగళూరు జేపీ నగర్‌లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి HDFC బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. రూ.7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులోకి మార్చుకుని పారిపోయారు. చిత్తూరు(D) గుడిపాల మండలం చీలాపల్లి కూడలి పెట్రోల్ బంకు వద్ద కారు వదిలి పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 21, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, ఎయిడెడ్, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు HM అకౌంట్ టెస్టుకు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు. ఓ పేపర్‌కు రూ.100, 2పేపర్ల పరీక్ష రాసేందుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.60 అపరాధ రుసుముతో నవంబరు 30వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.

News November 21, 2025

చిత్తూరు: రాగుల పంపిణీకి చర్యలు

image

చిత్తూరు జిల్లాలోని రేషన్ షాపుల్లో డిసెంబరు నెల నుంచి రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 350 టన్నుల జొన్నలు, 350 టన్నుల రాగులను కేటాయించిందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులకి ఇస్తున్న బియ్యం కోటాలో ఒక్కొక్క కేజీ వంతున రాగులు, జొన్నలు అందజేస్తామని చెప్పారు.