News July 29, 2024

మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటన.. ఇద్దరు RDOలు సస్పెండ్

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఇద్దరు RDOలు, సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అగ్ని ప్రమాదం ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం వంటి అభియోగాలను వారిపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే CI, మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 7, 2025

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.152 నుంచి రూ.168, మాంసం రూ.220 నుంచి 257 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.251 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు10 కోడిగుడ్ల ధర రూ. 90 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 7, 2025

సదుంలో సినిమా షూటింగ్

image

సదుం మండలంలోని తాటిగుంటపాలెంలో ‘నాన్న డైరీ’ సినిమా షూటింగ్ మూడు రోజులుగా జరుగుతోంది. క్లైమాక్స్ సంబంధించిన పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్ సురేశ్, నిర్మాత కోటి తెలిపారు. మరో మూడు రోజుల పాటు షూటింగ్ కొనసాగితే చిత్రీకరణ పూర్తి అవుతుందని వారు చెప్పారు. చిత్రంలో పీలేరుకు చెందిన ఖాదర్ బాషా, షాను, సన, సదుంకు చెందిన రచయిత, కళాకారుడు రామయ్య నటిస్తున్నట్లు వెల్లడించారు.

News December 6, 2025

కామాలూరు-చిత్తూరు RTC బస్సు సర్వీసు ప్రారంభం

image

తవణంపల్లి మండలంలోని కామాలూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బస్సు సర్వీసు ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.