News May 11, 2024
మదనపల్లె: బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

మదనపల్లె పట్టణం వారపు సంతలో బస్సు ఢీకొని గుత్తిని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారాన్ని తెలుసుకున్న రెండో పట్టణ ఎస్సై వెంకటసుబ్బయ్య మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.
Similar News
News February 14, 2025
చిత్తూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే, ఎంపీల చర్చలు

చిత్తూరు పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధి పై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్గాటించారు.
News February 14, 2025
చిత్తూరు: ప్రేమికుల రోజే.. యువతి నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యం?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం యువతిపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు నిర్భంధించి దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 108లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
తిరుపతి: కిరణ్ రాయల్పై కేసు నమోదు

తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామయ్య కథనం ప్రకారం.. లక్ష్మీరెడ్డి గతంలోఎస్పీ హర్షవర్ధన్ రాజుకు కిరణ్ రాయల్పై ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు విచారించి గురువారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.