News January 31, 2025
మదనపల్లె: యువతి ఆత్మహత్యాయత్నం

వంట చేయలేదని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రి ఔట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. బిహార్ రాష్ట్రం దివాన్ గంజికి చెందిన మోహన్లాల్ బతుకు తెరువుకోసం పుంగనూరుకు వచ్చి అక్కడి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె ప్రియాంక(19) వంటచేయలేదని గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో విషం తాగిన యువతిని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 13, 2025
కాంగ్రెస్ వాళ్లపై పింక్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నాం: MLC కవిత

తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న అరాచకాల్ని పింక్ బుక్లో నోట్ చేసుకుంటున్నామని BRS ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం కక్షపూరితంగా మా కార్యకర్తలపై కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా విమర్శలకు కూడా CM భయపడుతున్నారు. పోస్టు పెట్టిన తర్వాతి రోజే పోలీసులు ఇంటికొచ్చి వేధిస్తున్నారు. మీ లెక్కలన్నీ తేలుస్తాం’ అని హెచ్చరించారు.
News February 13, 2025
యూట్యూబర్ను అన్ఫాలో చేసిన కోహ్లీ, యూవీ

యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో క్రికెటర్లు విరాట్ కోహ్లీ, యువరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరు ఇప్పటివరకూ ఇన్స్టాగ్రామ్లో రణ్వీర్ను ఫాలో అవుతుండగా తాజాగా అన్ఫాలో చేశారు. ఇలాంటి వ్యక్తులను ఫాలో అవ్వకపోవడమే కరెక్ట్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీలు కూడా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 13, 2025
ఆసియాలో రిచెస్ట్ ఫ్యామిలీ ఎవరిదంటే?

ఆసియాలోనే టాప్-20 అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో 6 భారత్కు చెందినవేనని బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ₹7.86L Cr సంపదతో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. 4,7,9,13,18 స్థానాల్లో వరుసగా మిస్త్రీ(₹3.25L Cr), జిందాల్(₹2.44L Cr), బిర్లా(₹1.99L Cr), బజాజ్(₹1.74L Cr), హిందూజా(₹1.32L Cr) కుటుంబాలు ఉన్నాయి. 2,3, స్థానాల్లో చీరావనోండ్-థాయ్లాండ్(₹3.70L Cr), హర్టోనో-ఇండోనేషియా(₹3.66L Cr) నిలిచాయి.