News June 26, 2024

మదనపల్లె: లాడ్జిలో ఉద్యోగి ఆత్మహత్యా యత్నం

image

బెంగళూరులో పనిచేసే ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మదనపల్లె లాడ్జిలో విషంతాగి ఆత్మ హత్యాయత్నంకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు..కేవీ పల్లెకు చెందిన శ్రీనివాసులు(38) బెంగుళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం స్వగ్రామంవచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు సోమవారం మదనపల్లెకు వచ్చాడు. ఏం జరిగిందో ఏమో ఓలాడ్జిలో బసచేసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అస్పత్రికి తరలించారు.

Similar News

News September 15, 2025

చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.

News September 14, 2025

జిల్లా కలెక్టర్‌గా తవణంపల్లి వాసి

image

తవణంపల్లి మండలం వెంగంపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో స్వగ్రామంలో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలలో వారి తల్లితండ్రులు మునెమ్మ, దొరస్వామి రెడ్డి పాల్గొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కలెక్టర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని గ్రామస్థులు హర్ష వ్యక్తం చేశారు.

News September 14, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు..

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.