News June 26, 2024

మదనపల్లె: లాడ్జిలో ఉద్యోగి ఆత్మహత్యా యత్నం

image

బెంగళూరులో పనిచేసే ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మదనపల్లె లాడ్జిలో విషంతాగి ఆత్మ హత్యాయత్నంకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు..కేవీ పల్లెకు చెందిన శ్రీనివాసులు(38) బెంగుళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం స్వగ్రామంవచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు సోమవారం మదనపల్లెకు వచ్చాడు. ఏం జరిగిందో ఏమో ఓలాడ్జిలో బసచేసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అస్పత్రికి తరలించారు.

Similar News

News October 15, 2025

కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం

image

కుప్పం (M) నూలుకుంట గ్రామంలో క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. మురుగప్ప ఆచారి ఇంటి గడప ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గేసి అందులో పసుపు కుంకుమతో పాటు నిమ్మకాయలు, కోడిగుడ్డు, తమలపాకులు, అగరవత్తులు పెట్టి పూజలు చేశారు. దీంతో మురుగప్ప కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

News October 15, 2025

చిత్తూరు: పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

image

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై కలెక్టర్, జిల్లా పర్యాటక మండల చైర్మన్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కైగల్ జలపాతం, పులిగుండు, కంగుంది ప్రాంతాలతో పాటు మొగిలి దేవాలయాలలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఐరాల బుగ్గ మడుగు జలపాతం అభివృద్ధిపై అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, పర్యాటకశాఖ ఆర్డి రమణ పాల్గొన్నారు.

News October 15, 2025

కుప్పం RTC డిపో కోసం 15.37 ఎకరాలు

image

కుప్పం RTC డిపో ఏర్పాటుకు ప్రభుత్వం 15.37 ఎకరాలను కేటాయించింది. కుప్పం మున్సిపాలిటీ కమతమూరు రెవెన్యూ పరిధిలో 3.53 ఎకరాలు, గుట్టపల్లి రెవిన్యూ పరిధిలో 11.84 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన భూమిని మంగళవారం DPTO రాము, ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం కుప్పం ఆర్టీసీ డిపో బస్టాండ్ ఓకే చోటు ఉండగా ఆధునిక వసతులతో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు డిపోను ఏర్పాటు చేయనున్నారు.