News May 25, 2024

మదనపల్లె: శేషాద్రి హత్యకు ఆధిపత్య గొడవలే కారణమా..?

image

మదనపల్లెలో శనివారం వేకువ జామున రామారావుకాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే ఓ ముఠా ఈ ఘాతుకానిక పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆధిపత్య పోరులో భగంగా ముఠాలోని సుమారు 30 మంది ప్రత్యర్థులు శేషాద్రిని కత్తులు, వేట కొడవళ్లతో 70సార్లు అతికిరాతకంగా నరికి హతమార్చారు. పోలీసులు కత్తిపోట్లు చూసి విస్తుపోయారు.

Similar News

News December 6, 2025

బోయకొండ గంగమ్మ భక్తులకు గమనిక

image

బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వత నిత్యార్చన సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారుల ఆదేశాలతో సంక్రాంతి నుంచి అమ్మవారికి శాశ్వత నిత్యార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.10,116, 6నెలలకు రూ.7,116, 3నెలలకు రూ.5,116, నెలకు రూ.2,116తో సేవా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుంకుమార్చన రూ.101, వడి బాల సేవ రూ.201తో నూతన సేవలు ప్రవేశ పెడతామన్నారు.

News December 6, 2025

హోంగార్డుల సంక్షేమానికి కృషి: చిత్తూరు SP

image

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కవాతు ప్రదర్శనను వీక్షించారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరి సేవలు ప్రశంసనీయమన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని కొనియాడారు.

News December 6, 2025

చిత్తూరు: అంగన్వాడీలకు నిధులు మంజూరు.!

image

చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల మౌలిక వసతులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ శాఖ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున ఐఏఎస్ వీసీలో ఐసీడీఎస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, తాగునీరు, వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.